యాప్నగరం

నా చీర లాగేసి, వివస్త్రను చేయాలని చూశారు.. టీడీపీ మహిళా నేత సంచలనం!

ఏపీ పోలీసులపై తెలుగు దేశం పార్టీ మహిళా నాయకురాలు షాకింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Samayam Telugu 28 Nov 2021, 3:51 pm
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనను వివస్త్రను చేయాలని ప్రయత్నం చేశారని తెలుగు దేశం పార్టీ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వాపోయారు. తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేస్తుంటే కేసులు నమోదుచేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి


ఈ మేరకు విశాఖపట్నం టీడీపీ జిల్లా కార్యాలయంలో అనంతలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై షాకింగ్ ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సీపట్నంలో జరిగిన ఆందోళనలో తాను పాల్గొంటే పోలీసులు తనపట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

తనను ఆటోలోకి బలవంతంగా తీసుకువెళ్లడమేకాకుంగా, తన చీరలాగి వివస్త్రను చేసే ప్రయత్నం చేశారని అనంతలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. మహిళల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవుపలికారు. తనను వివస్త్రను చేయాలని పోలీసులు ప్రయత్నించారని అనంతలక్ష్మి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.