యాప్నగరం

విశాఖ: ప్రభుత్వ అధికారికి దిమ్మ తిరిగే షాకిచ్చిన కాంట్రాక్టర్

నర్సీపట్నంకు చెందిన లేబర్‌ కాంట్రాక్టర్‌ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్‌ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Samayam Telugu 23 Oct 2021, 12:15 pm

ప్రధానాంశాలు:

  • విశాఖ జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఏఈ
  • బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం
  • ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విశాఖ
విశాఖలో లేబర్‌ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏపీఈపీడీసీఎల్‌ ఏఈ ఏసీబీకి చిక్కాడు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు. బిల్లులను క్లియర్‌ చేసేందుకు నర్సీపట్నానికి చెందిన లేబర్‌ కాంట్రాక్టర్‌ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్‌ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఏఈ మహేశ్వరరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ షాపు దగ్గర రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మొత్తానికి మహేశ్వరరావుకు 5 శాతం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఈని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.