యాప్నగరం

విశాఖ: ఏడుగుర్ని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. వాళ్లు మాత్రమే ఆమె టార్గెట్!

విశాఖలో లేడీ కిలాడీ.. తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటున్న బాధితుడు. తనలాగే మొత్తం ఏడుగుర్ని ఆమె మోసం చేసినట్లు చెబుతున్నారు. మాయ మాటలు చెప్పి తనను మోసం చేసినట్లు ఆరోపించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Oct 2022, 1:00 pm

ప్రధానాంశాలు:

  • విశాఖలో లేడీ కిలాడీ పెళ్లిళ్ల వ్యవహారం
  • మహిళపై ఆరోపణలు చేసిన ఓ బాధితుడు
  • ఏడుగుర్ని మోసం చేసినట్లు చెబుతున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizag Woman Seven Marriages
ఓ లేడీ కిలాడీ ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని ఒకరికి తెలియకుండా ఇంకొరిని అన్నట్లు.. ఏకంగా ఏడుగుర్ని వివాహం చేసుకుని మోసం చేసింది. వీరిలో ఓ బాధితుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి శివ అనే వ్యక్తి దగ్గర పనికి చేరింది. అతడికి బాగా దగ్గరుకాగా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో వీరిద్దరు 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరు విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. శివ ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. అతడికి వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్‌ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేదని బాధితుడు చెబుతున్నారు. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరంట్ల దగ్గర డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరు మీదకు మార్చుకుందని శివ చెబుతున్నారు.

అక్కడితో ఆగకుండా ఆమె ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న సొమ్ము తీసుకుని తనను వదిలి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఆమెపై గుంటూరు, భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. ఆమె గురించి ఆరా తీస్తే.. భీమవరంలో ఇద్దరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తనకు తెలిసిందన్నారు.

ఈ మహిళ డబ్బున్న వారిని గుర్తించడం.. వారి దగ్గర పనుల కోసం చేరుతున్నట్లు బాధితుడు చెబుతున్నారు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటని.. ఇలా చాలామందిని మోసం చేసినట్లు తనకు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.