యాప్నగరం

విశాఖ: అమ్మఒడి డబ్బు కోసం భర్త అమానుషం

బ్యాంకుకు వెళ్లిన ఆమెపై డబ్బులు విత్‌డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించటంతో గొడవకు దిగాడు. తర్వాత భార్యాభర్తలు గుమ్మకోట సంతకు వెళ్లారు. అక్కడా డబ్బులు తీయమని ఒత్తిడి చేశాడు.

Samayam Telugu 14 Jan 2021, 9:42 am
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగడానికి అమ్మఒడి డబ్బు ఇవ్వలేదని భార్యను బండతో కొట్టి చంపాడు భర్త. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డకు చెందిన తామల దేముడమ్మ, భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు కాగా.. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెపై డబ్బులు విత్‌డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించటంతో గొడవకు దిగాడు.
Samayam Telugu విశాఖపట్నం


తర్వాత భార్యాభర్తలు గుమ్మకోట సంతకు వెళ్లారు. అక్కడా డబ్బులు తీయమని ఒత్తిడి చేశాడు. ఆమె ఎంత చెప్పినా డబ్బులు తీసేందుకు నిరాకరించింది. కోపంతో భర్త సంత నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పొలాల వద్ద ఆమెను బండతో కొట్టి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. ముందు తనకేమీ తెలియదని బుకాయించగా.. తర్వాత తానే చంపానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.