యాప్నగరం

విశాఖ: కాలువలో తండ్రి, కొడుకుల డెడ్‌బాడీలు.. గత నెలలో అదే కాలువలో శవాలై తేలిన భార్య, కూతురు

పన్నెల గోపాలకృష్ణ, ఉమాదేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీలో ఉంటున్నారు. గత నెలలో అత్తారంటికి వెళుతున్నామని చెప్పి మిస్సింగ్.

Samayam Telugu 4 Jan 2021, 10:21 am
విశాఖ జిల్లాలో తండ్రి, కొడుకుల మృతదేహాలు కాలువలో కనిపించడం కలకలంరేపింది. మాకవరపాలెం మండలంలోని ఏలేరు కాలువలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇవి అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీకి చెందిన గోపాలకృష్ణ, అతని కొడుకు రోహిత్‌లవేనని పోలీసులు నిర్థారించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu విశాఖపట్నం


పన్నెల గోపాలకృష్ణ, ఉమాదేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీలో ఉంటున్నారు. గోపాలకృష్ణ ఎన్‌టీపీసీలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె జాహ్నవి ఏడోతరగతి, కుమారుడు మణికంఠ రోహిత్‌ ప్రసాద్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. గత నెల 20న భార్య, పిల్లలతో కలసి గోపాలకృష్ణ బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేటలో అత్తారింటికి వెళ్తున్నామని చెప్పి బైక్‌పై వెళ్లారు. ఈ నెల 22న ఏలేరు కాలువలో తల్లీకూతుళ్ల డెడ్ బాడీలు దొరికాయి.

తల్లీకూతుళ్లే కాదు.. తండ్రీ కొడుకులు కూడా విగతజీవులుగా మిగలడం అందరినీ కలచివేసింది. గత ఐదేళ్లుగా వీరు పప్పుల చీటీలు వేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో వీరు ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల వల్లే గోపాలకృష్ణ, ఉమాదేవి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంక్రాంతి సమీంచడంతో పప్పుల చీటీల సొమ్ము డిమాండ్‌ చేస్తారన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.