యాప్నగరం

విశాఖ: కూతురి పెళ్లి, షాపింగ్‌కు వెళ్లిన మహిళ.. కొద్దిసేపటికి బ్యాగ్ తీసి చూస్తే

గొన్నంపూడికి చెందిన మంగ అనే మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు సోమవారం అనకాపల్లి వచ్చారు. పెరుగు బజార్‌ సమీపంలోని ఓ షాపు దగ్గర సామగ్రి కొనుగోలు చేశారు.

Samayam Telugu 18 May 2021, 1:27 pm

ప్రధానాంశాలు:

  • అనకాపల్లిలో కళ్లుగప్పి మహిళ బ్యాగులో డబ్బు చోరీ
  • కూతురి పెళ్లికి సామాన్లు కొనేందుకు వచ్చిన మహిళ
  • కొద్దిసేపటికే బ్యాగులో పెట్టిన డబ్బులు మాయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విశాఖపట్నం
విశాఖ జిల్లా అనకాపల్లిలో పట్ట పగలే డబ్బులు చోరీ కలకలంరేపింది. బుచ్చెయ్యపేట మండలం గొన్నంపూడికి చెందిన మంగ అనే మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు సోమవారం అనకాపల్లి వచ్చారు. పెరుగు బజార్‌ సమీపంలోని ఓ షాపు దగ్గర సామగ్రి కొనుగోలు చేశారు. కొద్దిసేపటికి ఆమె కర్రల బ్యాగును తీయగా.. అందులో ఉంచిన రెండు లక్షల నగదు అపహరించినట్లు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పెళ్లికి సంబంధించిన డబ్బులు కావడంతో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.