యాప్నగరం

విశాఖలో ఘోర ప్రమాదం, త్రీ టౌన్ సీఐ మృతి.. మరో రెండేళ్లలో రిటైర్మెంట్, ఇంతలోనే!

ఎండాడ సమీపంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే చనిపోగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.

Samayam Telugu 25 Nov 2021, 8:02 am

ప్రధానాంశాలు:

  • ఎండాడ సమీపంలో ఘోర ప్రమాదం
  • పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో
  • ప్రమాదంలో సీఐ అక్కడే మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విశాఖపట్నం
విశాఖ ఎండాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే చనిపోగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నైట్ డ్యూటీ ముగించుకుని వెళుతుండగా ప్రమాదం జరిగింది.. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
సీఐ కుటుంబాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ పరామర్శించారు. సీఐ ఈశ్వరరావు మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ఉందన్నారు.. ఈలోగా ఇలా జరగడం బాధ కలిగించింన్నారు సీపీ. ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని.. ఒక కుమారుడు చెన్నై నుంచి రావాలన్నారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అనేది చెప్పగలమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.