యాప్నగరం

విశాఖ రాయగడ మధ్య స్పెషల్ రైలు నడిపిన మహిళా సిబ్బంది.. ఉమెన్స్ డే సందర్భంగా

Vizag Rayagada Womens Day Special Train నడిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో ఈ రైలు విశాఖ నుంచి రాయగడకు వెళ్లింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Mar 2023, 1:40 pm

ప్రధానాంశాలు:

  • విశాఖ రాయగడ మధ్య స్పెషల్ రైలు
  • మహిళా సిబ్బందితో నడిచిన ట్రెయన్
  • మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizag Rayagada Womens Day Special Train
నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖ - రాయగడ మధ్య ప్రత్యేక రైలును మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో నడిచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షకు తగ్గట్టుగా క్లిష్టమైన రంగాల్లో కూడా మహిళలు ప్రవేశించారని విశాఖ నుంచి రాయగడ వెళ్లిన రైలు రుజువు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పూర్తి మహిళా సిబ్బందితో ఈ ప్రత్యేక రైలు నడిపింది.
ఈ ప్రత్యేక రైలులో పైలెట్, కో పైలెట్, టీసీలు, ఆర్‌పీఎఫ్ ఎఫ్ సిబ్బంది సహా అందరూ మహిళలే. ఈ రైలు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాయగడ వెళ్ళింది. లోకో పైలట్‌గా సహనకుమారి, అసిస్టెంట్‌గా కె.నాగమణి, ట్రైన్‌ మేనేజర్‌గా ఎం.కళ్యాణి విధులు నిర్వహించారు. ఈ రైలును వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ సతీమణి పారిజాత సత్పతి ప్రారంభించారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మహిళలు విజయం సాధించారనడానికి ఇది నిదర్శనం అని మహిళా ప్రతినిధులు అన్నారు. స్పెషల్ రైలు సిబ్బందిని అందరూ అభినందించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.