యాప్నగరం

విశాఖ: కాలువలో తల్లీకూతుళ్ల మృతదేహాలు.. ఆచూకీ లేని తండ్రీకొడుకు, మిస్టరీగా!

అడ్డాం గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి, కుమారుడి ఆచూకీ ఇంకా లభించకపోవడం కుటుంబసభ్యులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.

Samayam Telugu 22 Dec 2020, 10:34 am
విశాఖలో తల్లి, కూతుళ్ల మృతదేహాలు కాలువలో కనిపించడం కలకలంరేపింది. కశింకోట మండలం అడ్డాం గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రానికి బంధువులు వచ్చి పన్నెల ఉమాదేవి, కుమార్తె జాహ్నవి మృతదేహాలుగా గుర్తించారు. ఆ కుటుంబంలో మిగిలిన తండ్రి, కుమారుడి ఆచూకీ ఇంకా లభించకపోవడం కుటుంబసభ్యులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.
Samayam Telugu విశాఖలో మిస్టరీ


పన్నెల గోపాలకృష్ణ, ఉమాదేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీలో ఉంటున్నారు. గోపాలకృష్ణ ఎన్‌టీపీసీలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె జాహ్నవి ఏడోతరగతి, కుమారుడు మణికంఠ రోహిత్‌ ప్రసాద్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం భార్య, పిల్లలతో కలసి గోపాలకృష్ణ బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేటలో అత్తారింటికి వెళ్తున్నామని చెప్పి బైక్‌పై వెళ్లారు. సోమవారం ఏలేరు కాలువలో తల్లీకూతుళ్ల డెడ్ బాడీలు దొరికాయి.

వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. కాలువలో పడ్డారా.. ఇతర ప్రాంతంలో పడిపోతే ఇక్కడ తేలారా అన్నది తెలియాల్సి ఉంది. తండ్రి గోపాలకృష్ణ, కుమారుడు రోహిత్‌ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళణ వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లుగా వీరు పప్పుల చీటీలు వేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో వీరు ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణానికి ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.