యాప్నగరం

ఆస్తి కోసం కన్నతండ్రి హత్యకు కుట్ర.. విశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఆస్తి ఇవ్వనని చెబుతున్న తండ్రిని హత్య చేయాలని ప్లాన్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్, సుపారీ కిల్లర్‌ను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 12 Jan 2021, 8:24 am
ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేయడానికి కుట్ర పన్నిన దారుణ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో వెలుగుచూసింది. ఈ హత్యకు కుట్ర పన్నిన కొడుకుతో పాటు సుపారీ కిల్లర్‌ని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ ఎస్ఐ ధనుంజయ్‌ కథనం ప్రకారం... కొత్తూరుకు చెందిన ఆర్‌.శశికాంత్‌ అనే వ్యక్తి ఒడిశాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని శశికాంత్ తండ్రి తన ఆస్తిలో వాటా ఇవ్వబోనని తేల్చి చెప్పాడు.
Samayam Telugu Image


Also Read: పటాన్‌చెరు: పెళ్లికి నో చెప్పిన ప్రియుడు.. వదలకుండా వేధింపులు, యువతి షాకింగ్ నిర్ణయం

దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న శశికాంత్ ఆయన్ని చంపేస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని కుట్ర పన్నాడు. విశాఖపట్నానికి చెందిన అహ్మదుల్లా సుపారీ మాట్లాడుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి కారులో కొత్తూరుకు చేరుకున్నారు. ఆ సమయంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ భాస్కరరావుకు వారిపై అనుమానం కలిగింది. దీంతో ఇద్దరిని విచారించగా హత్య కుట్ర బయటపడింది. నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: కరోనా తల్లిదండ్రులు మృతి.. ఇంటికి పిలిచి నిప్పింటించిన చెల్లి.. ఆస్తి కోసం కిరాతకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.