యాప్నగరం

విజయనగరం: రైలు పట్టాలపై యువకుడి డెడ్‌బాడీ.. పెళ్లి ఫిక్సైన కొద్ది రోజులకే, కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

విజయనగరం జిల్లా జొన్నవలసకు చెందిన సంజీవ్‌ ఒంగోలులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. అతడికి వివాహం కుదిరింది. కానీ ఇంతలోనే మొత్తం మారిపోయింది.

Samayam Telugu 20 Jan 2021, 9:36 am
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కరోనా ప్రభావంతో యువకుడి జీవితం చిన్నాభిన్నమైంది.. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జొన్నవలసకు చెందిన సంజీవ్‌ ఒంగోలులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. అతడికి వివాహం కుదిరింది.. ఇంతలో కరోనా ప్రభావంతో ఉద్యోగం కోల్పోయాడు. ఒంగోలు నుంచి విజయనగరం వచ్చి మరో ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఇంతలోనే వధువు కుటుంబం యువకుడికి ట్విస్ట్ ఇచ్చింది.
Samayam Telugu విజయనగరం జిల్లాలో విషాదం


సంజీవ్‌కు ఉద్యోగం లేదని అమ్మాయి తరఫువాళ్లు పెళ్లికి నిరాకరించారు. ఉద్యోగం పోయింది.. జరగాల్సిన పెళ్లి రద్దయింది.. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికారు. ఇంతలో సారిక సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతుడికి తల్లి చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోగా.. తండ్రి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.