యాప్నగరం

వంగవీటి హత్యలో నిందితుడు కాదని ప్రమాణం చేస్తారా? టీడీపీ ఎమ్మెల్యేకు విజయసాయి సవాల్

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఇటీవల పలుచోట్ల స్థలాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

Samayam Telugu 1 Jan 2021, 7:25 am
విశాఖలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు మీసం మేలేస్తూ సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొండలు, వాగులు, వంకలను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించుకున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించగా.. దీనికి టీడీపీ ఎమ్మెల్యే సైతం ధీటుగా స్పందించారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, విజయసాయిరెడ్డి రావాలని రామకృష్ణబాబు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Samayam Telugu విజయసాయిరెడ్డి
YSRCP Rajya Sabha member V Vijayasai Reddy


తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడిని కాదని ప్రమాయం చేస్తావా? అంటూ సవాల్ విసిరారు. గురువారం రాత్రి ఆయన విశాఖపట్నంలోని మద్దిలపాలెం జంక్షన్‌లో వైఎస్ఆర్‌ విగ్రహ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ.. రంగాను, వెలగపూడి స్వయంగా కత్తితో పొడిచారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేసి, నిర్దోషిగా బయటకొచ్చారని ధ్వజమెత్తారు. వెలగపూడి మేక తోలు కప్పుకున్న తోడేలని ఎంపీ విజయసాయి విమర్శించారు.

ఇక, భూ దందాల విషయంలో విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే విసిరిన సవాల్‌కు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే, తాను సవాల్‌ విసిరింది విజయసాయి రెడ్డికి మాత్రమేనన్న ఎమ్మెల్యే వెలగపూడి.. విజయసాయి రెడ్డి వస్తారంటే.. తానూ ప్రమాణం చేయడానికి వస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాతే మిగిలిన వైఎస్ఆర్‌సీపీ నేతల సవాల్‌ను స్వీకరిస్తానని వెలగపూడి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.