అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసిన విజయసాయి.. అప్పుడేమైంది మీ వారసత్వం.?
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ఉత్తరాంధ్రలో కాక రేపుతోంది. హైకోర్టు ఆదేశాలతో ట్రస్ట్ చైర్మన్గా టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించడంతో వ్యవహారం వర్సెస్ వైసీపీగా మారింది.
Samayam Telugu 18 Jun 2021, 2:38 pm
ఏపీ హైకోర్టు తీర్పుతో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోమారు హాట్టాపిక్గా మారింది. చైర్ పర్సన్గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత నియామకం చెల్లదని కోర్టు తీర్పు వెలువరించడంతో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అశోక్ గజపతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం మారాయి. దోపిడీదారులకు మాన్సాస్ ట్రస్ట్లో చోటులేదని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.
వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. తాజాగా అశోక్ గజపతిని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రామతీర్థ క్షేత్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తు చేస్తూ అశోక్ గజపతిపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు చైర్మన్గా ఉన్న గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారని విజయసాయి ప్రశ్నించారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటుపోయిందంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాన్సాస్లో ఆడిటింగ్ వ్యవహారం ప్రస్తావించారు. ట్రస్ట్లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయిందని విజయసాయి అన్నారు. అశోక్ గజపతి మంత్రిగా ఉన్నప్పుడే మోతీ మహల్ కూల్చేశారని.. అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం అంటూ ప్రశ్నలు సంధించారు.
Also Read:
వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. తాజాగా అశోక్ గజపతిని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రామతీర్థ క్షేత్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తు చేస్తూ అశోక్ గజపతిపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు చైర్మన్గా ఉన్న గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారని విజయసాయి ప్రశ్నించారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటుపోయిందంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాన్సాస్లో ఆడిటింగ్ వ్యవహారం ప్రస్తావించారు. ట్రస్ట్లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయిందని విజయసాయి అన్నారు. అశోక్ గజపతి మంత్రిగా ఉన్నప్పుడే మోతీ మహల్ కూల్చేశారని.. అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం అంటూ ప్రశ్నలు సంధించారు.
Also Read: