యాప్నగరం

భారీ ప్రమాదం: అగ్నికి ఆహుతైన 25 ఎలక్ట్రిక్ బైక్‌లు!

పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం జరిగింది. ఓ బైక్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమయ్యాయి.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 24 Oct 2022, 10:12 pm
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఓ బైక్‌ షోరూంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ వాహనాలు (ఎలక్ట్రిక్ వెహికల్స్) విక్రయించే షోరూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 25 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
Samayam Telugu అగ్నికి ఆహుతైన బైక్స్


షోరూం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న మొత్తం 25 వాహనాలతో పాటు బ్యాటరీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు షోరూం యజమానులు తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో షోరూంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.