యాప్నగరం

టీడీపీ నాకు రూ.30కోట్లు ఆఫర్ చేసింది.. ఏపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

'నన్ను పార్టీలోకి రమ్మని టీడీపీ ఆహ్వానించింది.. రూ.30 కోట్లు ఇస్తామని చెప్పారు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో చెప్పుకొచ్చారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Jul 2022, 8:08 am

ప్రధానాంశాలు:

  • జగన్‌పై నమ్మకంతో టీడీపీలోకి వెళ్లలేదు
  • అందుకే ఈరోజు మంచి పదవిలో ఉన్నా
  • మొదటిసారి పదవి రాలేదని బాధపడలేదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రాజన్నదొర
ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విజయనగరంలో జిల్లా స్థాయి వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీలో చేరడానికి బేరం పెట్టారని ఆరోపించారు. తన పిల్లల చదువుతోపాటు రూ.30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు ఇస్తామన్నారని చెప్పుకొచ్చారు. కానీ తాను మాత్రం అధినేత జగన్‌పై ఉన్న నమ్మకం, అభిమానంతో పార్టీ మారలేదన్నారు. తాను టీడీపీలోకి వెళ్లకపోవడం వల్లే ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానని.. పదవిలో కొనసాగుతున్నాను అన్నారు.
తనకు మొదటిసారి మంత్రి పదవి రాకపోయినా సరే అసంతృప్తి వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. ఇదే జిల్లాకు చెందిన పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట కూడా అనలేదని.. పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తల్లో ఏది నిజమో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.27వేల కోట్లు మాఫీ చేశామన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.