అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివాసీలతో కలిసి పుష్ప శ్రీవాణి సంప్రదాయ థింసా నృత్యం చేసి అదరగొట్టారు. గిరిజన మహిళలతో కలిసి ఉల్లాసంగా కాలు కదిపారు. సబ్ కలెక్టర్ భావన కూడా ఈ సందర్భంగా థింసా నృత్యం చేశారు.
అంతకుముందు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన మాత విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో పార్వతీపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొట్టి ఎమ్మెల్యే జోగారావు అలరించారు. ఈ కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నాయకులు, అధికారులు గూడేలకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
కాగా, గతంలో కూడా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పుష్ప శ్రీవాణి చేసిన టిక్టాక్ వీడియో వైరల్ అయింది. పలుమార్లు గిరిజనులతో కలిసి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా, వారితో కలిసి మరోసారి థింసా డ్యాన్స్ చేశారు.
అంతకుముందు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన మాత విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో పార్వతీపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొట్టి ఎమ్మెల్యే జోగారావు అలరించారు. ఈ కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నాయకులు, అధికారులు గూడేలకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
కాగా, గతంలో కూడా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పుష్ప శ్రీవాణి చేసిన టిక్టాక్ వీడియో వైరల్ అయింది. పలుమార్లు గిరిజనులతో కలిసి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా, వారితో కలిసి మరోసారి థింసా డ్యాన్స్ చేశారు.