యాప్నగరం

ఘనంగా ఆదివాసీ దినోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐఏఎస్ నవ్య

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి, ఐటీడీఏ పీవో బి.నవ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 10 Aug 2022, 9:49 pm
ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, ఐటీడీఏ పీవో బి.నవ్య, పలువురు ఐఏఎస్‌లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.
Samayam Telugu ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారి నవ్య


ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఐటీడీఏ పీవోలు గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అందరినీ అలరించారు. అయితే, ఈ వేడుకల్లో ఐటీడీఏ పీవో బి.నవ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐఏఎస్ అధికారి అయిన నవ్య గిరిజన సాంప్రదాయ నృత్యం చేశారు. ఆదివాసీలతో సరదాగా కలిసిపోయి, కుటుంబ సభ్యురాలిలా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు.

ఉత్సవాల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్న ఐటీడీఏ పీవో నవ్యకు గిరిజనులు తమ సంప్రదాయ కానుకలు అందజేసి ప్రశంసలు కురిపించారు. అధికారులు ప్రజల సొంత మనిషిలా కలిసిపోతే.. మరిన్ని సమస్యలు తెలుసుకొని వారి కష్టాలను తీర్చే అవకాశం వస్తుందని ఈ సందర్భంగా ఐఏఎస్‌ నవ్య అభిప్రాయపడ్డారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.