యాప్నగరం

మూడేళ్ల చిన్నారి గొంతుకోసిన మామ.. విజయనగరంలో దారుణం

ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Samayam Telugu 12 Jun 2021, 4:41 pm
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని కిరాతకంగా హతమార్చాడో కసాయి. వరుసకు మేనకోడలిని గొంతుకోసి అమానుషంగా అంతమొందించాడు. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వరుసకు మేనమామ అయ్యే వినోద్ మూడేళ్ల చిన్నారి భవ్యశ్రీపై దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో చిన్నారి గొంతుకోసి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి నిద్రపోయిన కూతురు తెల్లారేసరికి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు వినోద్‌కి మతిస్థిమితం సరిగ్గా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.