యాప్నగరం

విజయనగరం: పెద్దమ్మను చంపాడు.. ఆ పాపం పోవాలని, వారం తర్వాత భార్య నుంచి ఫోన్ కాల్‌తో!

Lakkavarapu Kota Murder Case లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్గరి బంధువే మహిళను చంపినట్లు గుర్తించారు. వారం తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 15న పెద్దమ్మ మెడలో బంగారం లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు. ఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా కారం చల్లాడు.. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి.. అటు నుంచి కర్ణాటకకు కూలి పనుల కోసం పారిపోయిన నిందితుడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 24 Apr 2023, 9:52 am

ప్రధానాంశాలు:

  • విజయనగరం జిల్లా ఎల్ కోట సమీపంలో ఘటన
  • పెద్దమ్మను చంపేసి పారిపోయిన నిందితుడు
  • వారం తర్వాత పోలీసులకు దొరికిపోయాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Lakkavarapu Kota Murder Case
విజయనగరం జిల్లాలో సంచలనంరేపిన హత్యకేసు మిస్టరీ వీడింది. కొడుకు వరుసయ్యే వ్యక్తి ఆమెను చంపినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యకు దారి తీసిన కారణాలను వివరించారు. ఎల్‌.కోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు.. భార్య, పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో.. పెద్దమ్మ మాదాబత్తుల సూర్యకాంతం ఒంటిరిగా ఉంటున్న విషయాన్ని గమనించాడు.
ఈ నెల 15న మొహానికి ముసుగు వేసుకుని ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఎవరూ లేక పోవడంతో సూర్యకాంతం మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సూర్యకాంతం ప్రతిఘటించి మొహానికి ఉన్న ముసుగు తొలగించింది. అతడిని ఆమె గుర్తించింది.. ఎందుకు తనపై దాడి చేస్తున్నావని ప్రశ్నించింది. చోరీ యత్నబయటపడుతుందని భావించిన అతడు కత్తిపీటతో తలపై దాడి చేశాడు. కృష్ణ ఎవరికీ దొరక్కుండా.. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కారం చల్లాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. అక్క చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

బంగారంతో ఉడాయించిన కృష్ణ.. కొంత విశాఖలో రూ.1.48 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాడు.. వారి కోసం కొన్ని వస్తువులు కొన్నాడు. ఆ తర్వాత భార్య, పిల్లల్ని తీసుకెళ్లి అత్తింట్లో వదిలేశాడు. అతడు అక్కడి నుంచి బయల్దేరి.. తాను చేసిన పాపం పోవాలని విజయవాడ వెళ్లి తలనీలాలు సమర్పించి.. అక్కడి నుంచి నేరుగా కూలి పనుల కోసం కర్ణాటకకు వెళ్లిపోయాడు. ఈలోపు అతడికి భార్య ఫోన్ చేశారు.. పిల్లలకు బాగోలేదని చెప్పారు. పెద్దత్తను ఎవరో నరికేశారని రావాలని చెప్పింది.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కృష్ణపై అనుమానం వచ్చింది. అతడ్ని జమ్మాదేవిపేట దగ్గర అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. చేసిన నేరం ఒప్పుకొన్నాడు. అతడి దగ్గర బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పెద్దమ్మ దగ్గర చోరీ చేసిన బంగారం అమ్మేసి అప్పుల బాధను తీర్చుకోవాలని భావించాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి ఆమె తిరగడటంతో చివరికి ఆమెను చంపి జైలుపాలయ్యాడు.

పెద్దమ్మను హత్య చేసి ఎవరికీ దొరక్కుండా ఆధారాలు చెరిపేశాడు. కానీ భార్య ఫోన్ కాల్‌తో ఇంటికి వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసు మిస్టరీగా ఉన్నా సరే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక పోలీస్ సిబ్బందిని అభినందించారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.