యాప్నగరం

వైభవంగా సిరిమానోత్సవం.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సిరిమానోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 11 Oct 2022, 8:42 pm
విజయనగరంలో శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈసారి కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 3 లాంతర్లు మీదుగా కోట వరకు మూడు సార్లు సిరిమాను ఊరేగింపు జరిగింది.
Samayam Telugu ఘనంగా సిరిమానోత్సవం


ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కోట బురుజు మీద నుంచి ఉత్సవాన్ని తిలకించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఉప సభాపతి కొలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తదితరులు డీసీసీబీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఉత్సవాన్ని వీక్షించారు.

ఇక, పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని వచ్చేలా చేయాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. కాగా, సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో విజయనగరం జనసంద్రంగా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.