యాప్నగరం

TDP లో మరోసారి ముదిరిన వార్.. మాజీ కేంద్రమంత్రి Vs మాజీ ఎమ్మెల్యే

Vizianagaram Tdp మరోసారి విభేదాలు భగ్గుమన్నాయా.. ఫ్లెక్సీల వెనుక ఉన్నది ఎవరు. టీడీపీలో రెండు వర్గాల మధ్య మరోసారి వార్ నడుస్తోందా. అధిష్టానం చెప్పిన ఆమె ఎందుకు వెనక్కు తగ్గడం లేదు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Aug 2022, 7:40 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizianagaram Tdp
విజయనగరం టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అశోక్ గజపతి రాజు, మీసాల గీత మధ్య ప్లెక్సీ వార్‌ నడుస్తుండగా.. స్థానికంగా ప్లెక్సీలు కలవరపెడుతున్నాయి. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ ప్రధాన జంక్షన్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. ఇదంతా మీసాల గీత వర్గీయుల పని అంటోంది అశోక్ గజపతి రాజు వర్గం. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై స్పష్టత లేదు.
కొద్దిరోజులుగా విజయనగరం నియోజకవర్గంలో మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు,మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత మధ్య వార్ నడుస్తోంది. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలని గీత పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో విజయనగరం నియోజకవర్గం నేతలు చంద్రబాబును కలవగా.. అశోక్ గజపతికి బాధ్యతలు అప్పగించారు. అయినా సరే వార్ నడుస్తూనే ఉంది.

గతంలో అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే గీత పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నేరుగా అశోక్ వర్గాన్ని టార్గెట్ చేశారు. తనకు పార్టీకి సంబంధించిన ఏ సమాచారం అందడం లేదని.. జిల్లా కేంద్రంలో జెండా ఉనికి కోల్పోతుందనే కార్యాలయం ఏర్పాటు చేశామని అప్పట్లో చెప్పుకొచ్చారు. స్థానికంగా అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కాదని.. ఇలా చేయడం సరికాదనే అశోక్ వర్గం వ్యాఖ్యానించింది. అప్పుడు కూడా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ వెంటనే అశోక్ వర్గం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా.. అశోక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పారు.

టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అశోక్‌గజపతి రాజుది మొదటి నుంచి ఆధిక్యం. 2014 ఎన్నికల్లో మాత్రం పూసపాటి ఫ్యామిలీకి కాకుండా మీసాల గీతకు టికెట్ ఇవ్వగా.. విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గీతను పక్కన పెట్టి అశోక్‌‌గజపతి రాజు కుమార్తె అధితికి అవకాశం ఇవ్వగా.. ఆమె కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. గీత కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.. ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీల వార్ మొదలు కావడంతో.. టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.