యాప్నగరం

చిచ్చురేపిన కులాంతర వివాహం.. తలలు పగిలేలా కొట్టుకున్న రెండు వర్గాలు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో రెండు సామాజిక వర్గాల ఘర్షణ రణరంగాన్ని తలపించింది. కులాంతర వివాహంతో మొదలైన వర్గపోరు మరింత ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరిస్థితి దారితీసింది.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 26 Jun 2022, 2:10 pm

ప్రధానాంశాలు:

  • విజయనగరం జిల్లా రెండు సామాజిక వర్గాల ఘర్షణ
  • ఎస్సీ కుర్రాడు బీసీ కాలనీలో నీళ్లు తాగడంపై మొదలైన వివాదం
  • రణరంగాన్ని తలపించిన మల్వాడ గ్రామం.. 8మందికి గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కర్రలతో దాడికి పాల్పడుతున్న గ్రామస్తులు
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా మనదేశంలోని చాలా ప్రాంతాల్లో మాత్రం ఇంకా కులాలు, మతాల పేరుతో ప్రజలు ఘర్షణలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయిన కుల దురహంకారం ఎన్నో అమానవీయ ఘటనలకు కారణమవుతోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో జరిగిన ఘటన రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకునే పరిస్థితికి దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. మల్వాడ గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న ఓ బారుబావిలో ఎస్సీ కాలనీకి చెందిన ఓ కుర్రాడు మంచినీళ్లు తాగాడు. దీంతో బీసీ కాలనీవాసులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు నిలదీసేందుకు రాగా వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన రెండువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటలో సుమారు 8మంది వరకు గాయపడ్డారు.

గ్రామంలో ఇటీవల జరిగిన కులాంతర వివాహంతో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఎప్పుడు ఎవరు దొరుకుతారోనని రెండు వర్గాలు కాచుకుని చూస్తున్నాయి. తాజాగా ఎస్సీ బాలుడు బీసీ కాలనీలో నీళ్లు తాగడంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో మళ్లీ ఘర్షణ తలెత్తే అవకాశాలుండటంతో భారీగా బలగాలను మోహరించారు. గాయపడినవారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.