యాప్నగరం

విజయనగరం: ఇంటర్ స్టూడెంట్ మిస్ అయిన బస్సే, పగబట్టినట్లు.. షాకింగ్!

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మిస్ అయిన బస్సు.. వెంటాడి మరి మృత్యు శకటంగా మారింది..!

Samayam Telugu 27 Feb 2021, 11:59 pm
విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మిస్ అయిన బస్సు కింద పడి విద్యార్థిని దుర్మరణం చెంది. గజపతినగరంలోని మరుపల్లి వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కళాశాల విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంటాడ మండలం జయతి గ్రామానికి చెందిన గెద్ద ఇందు (17) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత స్థానిక బస్‌స్టాండుకు రాగా, అప్పటికే ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోయింది.
Samayam Telugu రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని కన్నుమూత


దీంతో గజపతినగరంలోని పెద్దమ్మ కుమారుడు చిన్నంనాయుడుకు ఇందు ఫోన్ చేసింది. దీంతో తాను కూడా అదే గ్రామానికి బయల్దేరినట్లు చెప్పడంతో అతడి ద్విచక్రవాహనం ఎక్కింది. ఈ తరుణంలో మరుపల్లి ఓలం కర్మాగారం వద్ద విద్యార్థిని తప్పిపోయిన అదే బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతతో ఇందు కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ ఇందును తక్షణమే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.