ఆంధ్రా నుంచి బిహార్ వెళ్తున్న మినీ వ్యాన్.. ఆపి చెక్ చేస్తే, దిమ్మతిరిగేలా..!
విజయనగరం జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu 23 Jul 2021, 9:04 pm
ఆంధ్రప్రదేశ్ నుంచి బిహార్కు అక్రమంగా తరలిస్తున్న రూ. 5.6 లక్షల విలువైన 561 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా, పాచిపెంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం డీఎస్పీ సుభాష్, సాలూరు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల నుంచి పాచిపెంట మండలంలోని కోడికాళ్లవలస మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు ముందస్తు సమాచారం అందుకున్నారు.
దీంతో పాచిపెంట ఎస్సై ఎంవీ రమణ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మినీ వ్యాన్ను ఆపారు. వ్యాన్లో చెక్ చేయగా పైన ఏమీ కనిపించలేదు. అయితే, గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో వ్యాన్ను లోతుగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మినీ వ్యాన్లో రహస్యంగా ఓ అర ఉండటాన్ని పోలీసులు గమనించారు.
ఆ రహస్య అర తెలిచిచూడగా పెద్ద ఎత్తున బస్తాలు బయటపడ్డాయి. ఈ అరలో మొత్తం దాచి ఉంచిన 109 పొట్లాల సరకు లభ్యమైంది. వ్యాన్ డ్రైవర్ను విచారించగా గంజాయిని బిహార్కు తరలిస్తున్నట్లు చెప్పాడు. దీంతో నిందితుడితో పాటు, సహాయకుడిగా వెళుతున్న విశాఖపట్నం జిల్లాకు చెరదిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
దీంతో పాచిపెంట ఎస్సై ఎంవీ రమణ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మినీ వ్యాన్ను ఆపారు. వ్యాన్లో చెక్ చేయగా పైన ఏమీ కనిపించలేదు. అయితే, గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో వ్యాన్ను లోతుగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మినీ వ్యాన్లో రహస్యంగా ఓ అర ఉండటాన్ని పోలీసులు గమనించారు.
ఆ రహస్య అర తెలిచిచూడగా పెద్ద ఎత్తున బస్తాలు బయటపడ్డాయి. ఈ అరలో మొత్తం దాచి ఉంచిన 109 పొట్లాల సరకు లభ్యమైంది. వ్యాన్ డ్రైవర్ను విచారించగా గంజాయిని బిహార్కు తరలిస్తున్నట్లు చెప్పాడు. దీంతో నిందితుడితో పాటు, సహాయకుడిగా వెళుతున్న విశాఖపట్నం జిల్లాకు చెరదిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.