యాప్నగరం

దాని కోసం భార్య తాళిబొట్టు తాకట్టుపెట్టి మరీ.. ఇదేంటని భర్తను అడిగితే.. షాకింగ్!

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఫూటుగా మద్యం తాగొచ్చిన భర్తను ఇదేంటని భార్య ప్రశ్నించినందుకు..!

Samayam Telugu 2 Apr 2021, 11:22 pm
జయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కనిమెరకవీధిలో గత నెల 28న హత్యకు గురైన మజ్జి వెంకటలక్ష్మి (34) కేసును పోలీసులు ఛేదించారు. వెంకటలక్ష్మిని ఆమె భర్త రమేష్‌ హత్య చేసినట్లు తేల్చారు. ఈ తరుణంలో నిందితుడు రమేష్‌ను అరెస్టు చేసి సాలూరు కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు రామభద్రాపురం పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. రమేష్ మద్యానికి బానిసగా మారి రోజూ ఫూటు తాగి ఇంటికి వచ్చేవాడన్నారు. ఈ కారణంగా వెంకటలక్ష్మికి భర్త రమేష్‌తో గొడవలు జరిగేవన్నారు.
Samayam Telugu మంగళసూత్రం (ప్రతీకాత్మక చిత్రం)


మద్యం మత్తులో రమేష్ తన భార్యను తరచూ కొట్టేవాడని ఎస్ఐ తెలిపారు. మద్యానికి బానిసై చివరికి భార్య తాళిబొట్టును కూడా తాకట్టుపెట్టాడని వివరించారు. తాళిబొట్టు తాకట్టు పెట్టిన విషయాన్ని తన తల్లికి చెబుతానన్న భార్య చెప్పడంతో.. కోపంతో రగిలిపోయిన రమేష్ వెంకటలక్ష్మి తలను మంచానికి మోది, కొనఊపిరితో ఉండగా.. ఉరేశానని రమేష్‌ నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

కాగా, తొలుత రమేష్ తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సుభాష్, సీఐ అప్పలనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే, రమేష్ బట్టలకు రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.