యాప్నగరం

మద్యం తాగి ఇంటికొచ్చిన భార్య.. భర్త కోపంతో రగిలిపోయి. ఘోరం!

విజయనగరం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య మద్యం తాగి ఇంటికొచ్చిందని..!

Samayam Telugu 29 Mar 2021, 9:09 pm
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య మద్యం తాగి ఇంటికి వచ్చిందన్న కోపంతో ఆమెపై భర్త దాడి చేసి హత్య చేశాడు. పాచిపెంట మండలం మాతుమూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి సాలూరు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా అరకు లోయ మండలం పూజారిపుట్టి గూడేనికి చెందిన దంపతులు శోభన్‌ (30), మర్రి తులసి (24) మాతుమూరు సమీపంలో ఓ రైతుకు చెందిన ఆయిల్‌ పామ్‌ తోటలో పనికి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే, శనివారం తులసి తన తల్లి రమాతో కలిసి సాలూరు వెళ్లి మద్యం తాగి సాయంత్రానికి ఇంటికి చేరుకొంది. భార్య మద్యం తాగిన విషయం తెలిసిన భర్త ఆమెతో ఈ విషయమై గొడవపడ్డాడు. భర్త గొడవపడుతున్న సమయంలో తులసి సమీపంలోని పొలంలోకి వెళ్లిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన శోభన్‌.. చేతిలో ఉన్న కర్రతో ఆమెను ముఖంపై బలంగా కొట్టాడు. అక్కడే కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.

ఈ సమాచారం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎస్సై ఫకృద్దీన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య గొడవే హత్యకు కారణమని, భర్త పరారీలో ఉన్నాడని సీఐ ఎల్‌.అప్పలనాయుడు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.