యాప్నగరం

ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్‌కు దక్కుతుంది.. వైసీపీ నేత ప్రశంసలు

Vizianagaram Zp Chairman ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ 1980వ దశకంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నా సరే.. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టేవారని పొగిడారు. కిలో బియ్యాన్ని రూ.2కే ఇచ్చి పేదలను ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం బియ్యం వినియోగం తగ్గి.. చిరుధాన్యాల అవసరం ఎక్కువైంది అన్నారు. రాష్ట్ర స్థాయి చిరుధాన్యాల మహోత్సవంలో జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 Jan 2023, 12:22 pm

ప్రధానాంశాలు:

  • విజయనగరం జెడ్పీ ఛైర్మన్ కామెంట్స్
  • ఎన్టీఆర్ మూడు పూటలా అన్నం పెట్టారు
  • కిలో బియ్యం రూ.2 కే పేదలకు ఇచ్చారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Majji Srinivasa Rao
ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వియజనగరం జెడ్పీటీసీ ఛైర్మన్, వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు. విజయనగరంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి చిరుధాన్యాల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఆయన కిలో బియ్యాన్ని రూ.2కే ఇచ్చి పేదలను ఎన్టీఆర్‌ ఆదుకున్నారని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1980వ దశకంలో ఆహార ధాన్యాల కొరత ఉండేదన్నారు శ్రీనివాసరావు. అయినా సరే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రాష్ట్ర ప్రజలకు 3 పూటలా అన్నం పెట్టేవారని ప్రశంసించారు. ఈ పథకానికి అప్పట్లో మంచి స్పందన వచ్చిందని.. ప్రస్తుతం బియ్యం వినియోగం తగ్గి.. చిరుధాన్యాల అవసరం ఎక్కువైంది అన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్టీఆర్ మంచి పనులు చేశారంటూ శ్రీనివాసరావు పొగిడేశారు.

సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండిస్టీస్‌, ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మిల్లెట్‌ (చిరు ధాన్యాల) మహోత్సవం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించగా.. చిరుధాన్యాలతో చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, వంటల ప్రదర్శన, విక్రయాలను 25 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.