యాప్నగరం

గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యంలా.. ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు!

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 6 Jul 2021, 7:30 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్నేహ బంధాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతిరాజు పదవుల కోసం చంద్రబాబుకు మాన్సాస్ ట్రస్టును తాకట్టుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు, చంద్రబాబు


దర్యాప్తులో అశోక్ గజపతి బాగోతాలన్నీ బయట పడతాయని, శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతోమావా.. గాడిదలు కాస్తున్నావా రాజా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం వరుస ట్వీట్లు చేశారు.

‘‘అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోంది. 2004 నుంచి మాన్సాస్‌లో అసలు ఆడిటింగే జరగలేదు. ఆడిటింగ్‌కి డబ్బులిచ్చేశాం.. అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే ఏం లాభం. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతోమావా.. గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యంలా చేశావు.’’ అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.