యాప్నగరం

శీఘ్రంగా పెళ్లి కావాలంటే శివరాత్రి రోజు ఈ పరిహారాలు పాటించాలి

ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు లేదా త్వరితగతిన పెళ్లికావాలనుకునే వారు కొన్ని పరిహారాలు పాటించాలి. జ్యోతిషశాస్రంలో పేర్కొన్న ఈ నియమాల ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. అయితే మీరు వీటిని పూర్తి భక్తి, విశ్వాసాలతో పాటించాలి.

Samayam Telugu 7 Mar 2021, 7:14 am
ఆలుమగల గురించి చెప్పుకోవాలంటే శివపార్వుతుల గురించి ముందుకు తెలుసుకోవాలి. పార్వతి దేవి కోసం ఆ భోలా శంకరుడు ఏకంగా తన అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనాధీశ్వరుడీగా కీర్తి గడించాడు. వీరిద్దరి మధ్య ప్రేమకు అవధులు ఉండవు. జనులు వీరిని చూసి ఎలా అన్యోన్యయంగా ఉండాలో, ప్రేమించాలో నేర్చుకోవాలి. మీరు కూడా వీరిలాగే కలకాల సుఖంగా, ప్రేమాప్యాతలతో ఉండాలంటే మహాశివరాత్రి రోజు మీకు గొప్ప అవకాశం కలగనుంది. ఆ రోజు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు లేదా త్వరితగతిన పెళ్లికావాలనుకునే వారు కొన్ని పరిహారాలు పాటించాలి. జ్యోతిషశాస్రంలో పేర్కొన్న ఈ నియమాల ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. అయితే మీరు వీటిని పూర్తి భక్తి, విశ్వాసాలతో పాటించాలి. అప్పుడే ఈ చర్యలు విజయవంతమవుతాయని గుర్తుంచుకోండి.
Samayam Telugu mahashivratri remedies for fast marriage and love marriage
శీఘ్రంగా పెళ్లి కావాలంటే శివరాత్రి రోజు ఈ పరిహారాలు పాటించాలి



​మీరు పాటించాల్సిన మొదటి నియమం..

మీరు ఒకరిని నిజాయితీగా ప్రేమిస్తుంటే, వారినే వివాహం చేసుకోవాలనుకుంటే లేదా వారితో పెళ్లి ఆలస్యమవుతుంటే ఈ పరిహారం పాటించాలి. మహాశివరాత్రి రోజున శివపార్వతుల విగ్రహాలు పక్కపక్కనే ఉన్న ఆలయానికి వెళ్లి వారిద్దరినీ సంయుక్తంగా పూజించండి. అనంతరం ఎరుపు రంగు దారం తీసుకోండి. అయితే పెద్దదిగా ఉండాలని గుర్తుంచుకోండి. దీన్ని చేతుల్లో పట్టుకుని శివపార్వతుల చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు విగ్రహాలకు ఆ దారాన్ని కట్టండి. తిరగడానికి ఒకే చోటు నిలబడి ఏడుసార్లు కట్టాలి. చివరకగా మీ కోరిక తీర్చాలని శివపార్వతులను ప్రార్థించాలి.

​గొప్ప పనులకు ఈ పరిహారంతో పరిష్కారం..

మహాశివరాత్రి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి శివాలయానికి వెళ్లాలి. అనంతరం సుహాగ్ వస్తువులైన ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్రని పువ్వులు, ఏడు రంగుల గాజులను పార్వతిదేవికి అందించాలి. అలాగే ఆమెను ప్రార్థించాలి. ప్రేమ, గౌరవనీయమైన జీవిత భాగస్వామి దొరకాలని వేడుకోవాలి. పరమేశ్వరుడు లాంటి వరుడు దొరకాలని ప్రార్థించాలి. అనంతరం రామచరితమానసలోని ముఖ్యంగా బాలకాండలో ప్రస్తావించిన శివపార్వతుల వివాహానికి సంబంధించిన ఘట్టాన్ని చదవండి.

​మనస్సుకు నచ్చిన వరుడు కోసం ఈ పరిహారం..

మీరు ఒకరిని ప్రేమించినట్లయితే వారిని వివాహం చేసుకోవాలని కోరుకుంటే ఈ పరిహారం పాటించాలి. కాబట్టి రామచరితమానసలోని తౌ భగవాను సకల ఉర బాసి| కరీహీ మోహీ రఘభర్ కై దాసీ|| జేహీ కే జేహీ పర్ సత్య సునేహూ| సో తేహీ మిలయి న కుచ్ సందేహూ|| అనే పద్యాన్ని మహాశివరాత్రి రోజున చదవాలి. ఇది కూడా రామచరితమానసలోని బాల కాండలో ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఇష్టమైన వరుడిని వివాహం చేసుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.