యాప్నగరం

Birthday 24 September 2022 నేడు డైరెక్టర్ శ్రీనువైట్ల బర్త్ డే, ఈరోజు పుట్టిన వారికి వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

Birthday 24 September 2022 శనివారం రోజున టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల, బాలీవుడ్ నటుడు రాజేష్ ఖట్టర్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 24 Sep 2022, 1:10 am
Birthday 24 September 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో శనివారం రోజున టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల, బాలీవుడ్ నటుడు రాజేష్ ఖట్టర్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Srinu Vaitla Birthday


వర్ష కుండలి గణన ప్రకారం, ఈ ఏడాది అంగారకుడు మీకు అధిపతిగా ఉంటాడు. మరోవైపు చంద్రుడు పదకొండో స్థానంలో ఉండటం వల్ల వచ్చే ఏడాదిలో మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు అనేక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. మేధోపరమైన ప్రయత్నాల్లో కూడా మీరు ఆశించిన విజయాలు సాధిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో మీరు ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి.

Mahalaya Amavasya 2022 మహాలయ అమావాస్య వేళ 4 గ్రహాల అరుదైన కలయిక.. ఈ 5 రాశులకు మహార్దశ.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
వచ్చే ఏడాది 2023 సంవత్సరంలో జనవరి వరకు మీకు అంగారకుడి ప్రభావం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మీకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో మీరు కొత్త వ్యాపార పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రయత్నాల్లో మంచి విజయాలను సాధిస్తారు. జూన్ నెలలో విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

జూలై మధ్యలో మహిళల వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది మొత్తం శుభ ఫలితాల కోసం మీరు ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు ప్రతి శనివారం రోజున ఆంజనేయుడికి మల్లెల నూనెతో కలిపిన పచ్చి మిరపను సమర్పించడం శుభప్రదంగా ఉంటుంది.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.