యాప్నగరం

ఈ నెల 15న ధనస్సు రాశిలో సూర్యుడు ఆగమనం.. వచ్చే 30 రోజులు ఏమవుతుందో తెలుసా?

డిసెంబరు 15న సూర్యుడు ధనస్సులో సంచరించనున్నాడు. ధనస్సు రాశికి అధిపతి గురు గ్రహం. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాబోయో 30 రోజుల పాటు ఈ రాశిలో ఉండనున్న సూర్యుడు ప్రభావం వల్ల గ్రహాల స్థితి మారుతుంది. ఈ సారి డిసెంబరు 15 మంగళవారం రాత్రి 09.33 గంటలకు ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు.

Samayam Telugu 11 Dec 2020, 4:58 pm
సూర్యుడు ఏడాదిలో 12 రాశుల్లో సంక్రమిస్తాడు. అంతేకాకుండా ప్రతి రాశిలో 30 రోజులు ఉంటాడు. దీన్ని సౌర నెల అని పిలుస్తారు. అదే క్రమంలో డిసెంబరు 15న సూర్యుడు ధనస్సులో సంచరించనున్నాడు. ధనస్సు రాశికి అధిపతి గురు గ్రహం. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాబోయో 30 రోజుల పాటు ఈ రాశిలో ఉండనున్న సూర్యుడు ప్రభావం వల్ల గ్రహాల స్థితి మారుతుంది. ఈ సారి డిసెంబరు 15 మంగళవారం రాత్రి 09.33 గంటలకు ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు.
Samayam Telugu ధనస్సు రాశిలో సూర్యుడు ఆగమనం


Also Read: ప్రేమ వివాహం విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసా..?

సూర్యుడు జాతకం మార్గశిర్షలోని ధనస్సు సంక్రాంతి శని లేదా మంగవారం రోజు ఒడిషా, కర్ణాటక, బంగాల్, దక్షిణ మహారాష్ట్ర, మలేషియా, మధ్యప్రదేశ్ లోని దోయబ్ ప్రాంతాల్ల జరుగుతుంది. యుద్ధం వల్ల ప్రజలు ఆగ్రహంగా ఉంటారు. ప్రస్తుతం ధనస్సులో సూర్యుడు కదలిక మధ్య, దక్షిణ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతు ఉద్యమం వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రభుత్వ ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా అవసరమైన వస్తువుల ధరలపై ప్రజలు అసంతృప్తిని కలిగిస్తుంది.

చలి రికార్డు స్థాయిలో ఉంటుంది..
ధనస్సు సంక్రాంతి భారత కాలమాన ప్రకారం కర్కాటక లగ్నంలో ఉంటుంది. అంతేకాకుండా గురుడు, శని ఏడో పాదంలో ఉన్నారు. గురుడు, శని మిశ్రమ ప్రభావం వల్ల సాముహిక కదలిక తీవ్రతరం చేయవచ్చు. మకర రాశిలోని బృహస్పతి, శని, శుభ సంకేతాల వల్ల మైదాన పాంతాల్లో తేలికపాటి వర్షాన్ని కలిగిస్తాయి. శీతాకాలంలో పర్వతాల్లో హిమాపాతం అధికంగా ఉంటుంది. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

Also Read: వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. అద్భుతమైన యాదృచ్ఛికం

వీటి ధరలు పెరుగుతాయి..
డిసెంబరు 17న ధనస్సు రాశిలో బుధుడు.. సూర్యుడుతో కలిసే సమయం, డిసెంబరు 24న అంగారకుడు మేష రాశిలో మారే సమయంలో చలి తీవ్రంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సూర్యుడు ధనస్సు రాశిలోకి వచ్చినప్పుడు చమురు ధర పెరుగుతుంది. అంతేకాకుండా పత్తికి డిమాండ్ ఏర్పడుతుంది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది..అంగారకుడు మేష రాశిలో మారే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య వైరం పెరుగుతుంది. అంతేకాకుండా పాకిస్థాన్ లో ప్రభుత్వాని వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా ఉంటుంది. ఇది ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బందులను పెంచుతుంది. మకరంలో గురుడు, శని కలయిక కారణంగా రాబోయో 30 రోజుల్లో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.