యాప్నగరం

‘S’ అక్షరంపై గ్రహణం ఎఫెక్ట్.. ఆ మూడు అక్షరాలపైనా ప్రభావం!

ఆదివారం ఏర్పడుతున్న సూర్య గ్రహణం ప్రభావం ఇప్పటికే మొదలైంది. S, A, C, J అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వారిపై గ్రహణం ప్రభావం ఉంటుందని వాస్తు పురుష ప్రసాద్ తెలిపాు.

Samayam Telugu 19 Jun 2020, 6:26 pm
జూన్ 21న ఏర్పడే సూర్య గ్రహణం మూడు నెలల ముందు నుంచే ప్రభావం చూపుతోందంటున్నారు వాస్తు పురుష ప్రసాద్. S, A, C, J అక్షరాలతో మొదలయ్యే పేర్లపై ఈ గ్రహణం ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోందని అక్షరాన్ని వెంటాడుతోందన్నారు. గత ఏడాది సెప్టెంబర్లోనూ ఆయన గ్రహణ ప్రభావం ‘ఎస్’ అనే అక్షరంపై ఉందని చెప్పారు. సుష్మా స్వరాజ్, కొడెల శివప్రసాద్‌ల మరణాలను ఆయన గతంలో ఉదహరించారు.
Samayam Telugu గ్రహణం
surya grahan effect


ఆదివారం ఉదయం 10.21 నిమిషాలకు ఏర్పడే గ్రహణం ప్రభావం గత మూడు నెలల నుంచే ఉందని.. ఇది 9 నెలల వరకు కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. నేమాలజీ (Nameology) ప్రకారం గ్రహణాలు ఏర్పడే రాశులను బట్టి అపమృత్యు దోషం గురించి విశ్లేషణ చేయొచ్చన్నారు. గ్రహణం ప్రభావం గురించి వాస్తు పురుష ప్రసాద్ మాటల్లోనే..

‘‘తరచుగా సూర్యగ్రహణం, చంద్ర గ్రహణాలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. చంద్రుడు మాతృకారకుడు కాగా.. సూర్యుడు
పితృకారకుడు. Nameology ప్రకారము గ్రహణం ఏర్పడబోయే 3 నెలల ముందు నుంచే ప్రభావం చూపుతుంది. గ్రహణాలు ముఖ్యంగా రాజకీయ నాయకులకు కీడుసూచిస్తాయి. పోలీసు, రక్షణ, సినిమా, వ్యాపార రంగాల్లోని వారిపైనా ప్రభావం చూపుతాయి.

జూన్ 21న ఏర్పడే గ్రహణం నేమాలజీ ప్రకారం ఏ విధంగా ప్రభావం చూపుతోందంటే.. ఇటీవలే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. ఆయన వదిన కూడా మరణించారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనే.. విశాఖకు చెందిన సుగుణ కుమారి కూడా సూసైడ్ చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాస్‌పై మండలిలో దాడి జరగడం, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హోం క్వారంటైన్లోకి వెళ్లడం కూడా గ్రహణం ప్రభావంగానే చెప్పుకోవచ్చు.

చైనాతో జరిగిన పోరులో అమరుడైన సంతోష్, ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తీవ్ర అనారోగ్యం బారిన పడటం, రాయపాటి సాంబశివరావు అస్వస్థతకు గురవడం లాంటి ఘటనలను ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి, తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ కూడా ఈ మధ్యే కన్ను మూశారు. అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా విశాఖ వెళ్లకుండానే హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది. కాబట్టి A, C, S, J అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:
మృత్యుంజయ జపం, హోమం చేయాలి. మినుములు, బియ్యం, గోధుమలు దానం చేయాలి. వన దుర్గను ప్రార్థించడం.

Disclaimer: ఈ ఆర్టికల్‌‌లో ప్రస్తావించి అంశాలు రచయిత అభిప్రాయం మాత్రమే. దీనికి ‘సమయం’తో సంబంధం లేదు, మేం ఎలాంటి బాధ్యతా వహించం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.