యాప్నగరం

వినాయకుడు కలలోకి వస్తే ఏమవుతుందో తెలుసా..?

మనుషులకు కలలు రావడమనేది ఎంతో సాధారణం. అయితే వినాయకుడు కలలో రావడం ఎంతో శుభ పరిణామంగా భావించాలి. విఘ్నాలను హరించే గణనాథుడు కలలోకి వస్తే త్వరలో ఓ మంచి పని ప్రారంభించబోతున్నామని అర్థం చేసుకోవాలి.

Samayam Telugu 9 Jul 2020, 4:40 pm
కలలు.. మనిషి జీవితంలో ఎంతో సాధారణం. మనలో చాలామందికి మునుపటి రాత్రి కలలను గుర్తుంచుకుంటారు. అంతేకాకుండా అవి తరచూ మనసును ఆలోచింపజేస్తాయి. అయితే కొంతమంది వీటిపై పెద్దగా దృష్టిపెట్టరు. మిగిలిన వారు ఏమవుతుందోనని కొంత ఆశ్చర్యపోతారు. ఏదైమైన నిద్రలో వచ్చే కలలు మన నియంత్రణంలో ఉండేవి కావు. అవి మన గతం లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలుగా జనులు విశ్వసిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని శుభం లేదా అశుభానికి చెందిన కలలుగా విభజించవచ్చు. ఈ నేపథ్యంలో స్వప్నంలో వినాయకుడు కలలోకి వస్తే ఏమవుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం.
Samayam Telugu గణేశుడి గురించి కల కనడం


Also Read: రాశిచక్రం ప్రకారం ఇతరుల కంటే మీలో ఉన్న మంచి లక్షణావివే..!

విఘ్నాలను హరించేవాడు గణనాథుడు..
గణేశుడు కలలోకి రావడమంటే అది ఎంతో శుభ పరిణామంగా పరిగణించాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడంటేనే విఘ్నాలను హరించేవాడని అర్థం. అంటే జీవితంలో వచ్చే అవరోధాలను అడ్డుకుని సాంత్వన కలిగిస్తాడని నమ్ముతారు. అందుకే ఏ పని ప్రారంభించేముందైన గణేశుడిని పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తే అందులో సమస్యలేమైనా ఎదురైనా తొలుగుతాయి. అంతేకాకుండా శుభం కలిగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దేవతలందరికంటే ముందు ఆది పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి.

గణపతి ఆశీర్వాదం పొందినట్లే..
వినాయకుడు శుభానికి ప్రతిరూపం. అంతేకాకుండా ఎంతో మంచి చేస్తాడని నమ్మకం. కలలో గణనాథుడు వస్తే ఆయను అనుగ్రహం పొందినట్లేనని సూచన. వినాయకుడిని సుఖార్త అని కూడా అంటారు. అంటే మంచి చేసేవాడు లేదా సుఖ-సంతోషాలను కలిగించేవాడని అర్థం. కాబట్టి ఆయన గురించి కలలు కన్నప్పుడు త్వరలో శుభవార్తలు వినబోతున్నారని తద్వారా ఆనందం పొందవచ్చని తెలుసుకోవాలి.

Also Read: మీకు ఇలాంటి కలలు వస్తే.. డబ్బుకు కొరత ఉండదు..!

వినాయకుడు కలలోకి ఎందుకు వస్తాడంటే..
కలలో గణేశుడు కనిపించాడంటే త్వరలో మీరు ఓ పనిని లేదా వ్యక్తిగత జీవితంలో నూతన ప్రారంభాన్ని ఆరంభించబోతున్నారని సూచిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరైమైనా మొక్కులు మొక్కి తీర్చలేనప్పుడు వాటిని గుర్తు చేసేందుకు కూడా గణనాథుడు కలలో కనిపించవచ్చు. ఈ విధంగా కనిపించి ఆ మొక్కును ఆయన స్వరూపం ద్వారా గుర్తు చేసినట్లు అర్థం చేసుకోవాలి. దీనర్థం ఇచ్చిన వాగ్ధానాలు ప్రజలు ఎప్పటికీ మరువకూడదని సూచిస్తుంది.

Also Read: మూగజీవాలకు తినిపిస్తే.. సుఖ, సంతోషాలు మీ వెంటే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.