యాప్నగరం

మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసా..?

మరణం మనుషుల జీవితంలో వచ్చే అందరికి తెలిసిన నిజం. అయితే మరణించే ముందు జీవిలో కొన్ని మార్పులు, లక్షణాలు కనిపిస్తాయి. వారి శరీరం రంగు మారిపోవడం లేదా వారి అంగిలి తడి ఆరి పోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కళ్లు కూడా మసకబారతాయి.

Samayam Telugu 7 Sep 2020, 8:08 am
కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన-మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. జననం-మరణం అనేది ఆత్మలు తిరుగుతున్న చక్రం లాంటివి. ధనవంతుడు, పేదవారు అందరికీ మరణం రావడం తథ్యమైనప్పటికీ ఒకే విధంగా మాత్రం ఉండదు. ఇది వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది.
Samayam Telugu what are the types of death and what happened before death
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసా..?



​వీరి ఆత్మలకు శాంతి ఉండదు..

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం రెండు రకాలుగా ఉంటుంది. సహజమైన, అసహజమైన మరణాలు అని రెండు రకాలుగా ఉంటుంది. సహజ మరణం అనారోగ్యం వల్ల, శరీరం వృద్ధాప్యంతో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్లడంతో సంభవిస్తుంది. అసహజ మరణం అంటే ప్రమాదావశాత్తు సంభవించే ఘటనలు. పాము కాటు, ఆయుధాలు, ఆత్మహత్య ఇలా రకరకాల ప్రమాదాల ద్వారా వచ్చే మరణాలు అసహజమైనవి. అకాల మరణంతో బాధపడుతున్న మనిషి ఆత్మ చంచలమైనంది. ఎందుకంటే వీరికి భౌతిక కోరికలు పూర్తిగా నశించవు. అలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మ భూలోకానికి, పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతుంది. పితృ పక్షంలో వీరి పేరిట పిండ ప్రధానం చేస్తే వారి ఆత్మకు సంతృప్తి, శాంతి చేకూరుతుంది. శివపురాణం, గరుడ పురాణం, కఠోపనిషత్తు సహా అనేక గ్రంథాలు మరణం తదుపరి జీవితాన్ని గురించి వివరిస్తాయి.

​శరీరం రంగు మారుతుంది..

శివ పురాణం ప్రకారం సహజంగా మరణానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపస్తాయని పేర్కొంది. మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కళ్లు ఎర్రబడి ఉండటాన్ని సూచిస్తుంది. అంటే వ్యక్తి ఎక్కువ కాలం సజీవంగా ఉండలేరు అనేదానికి సంకేతంగా చెబుతారు.

​సూర్య-చంద్రులు ఈ విధంగా కనిపిస్తారు..

సూర్యుడు, చంద్రుడు చుట్టూ నలుపు రంగులు గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా వాటి చుట్టూ నల్ల మంటలు చూసినా అవి మరణానికి దగ్గరగా ఉన్న సంకేతాన్ని సూచిస్తాయి. ఈ పరిస్థితుల్లో మనిషి ప్రాపంచి భ్రమలు త్యజించి బాధ్యతలను తన సంతానానికి అప్పగించి ఆ భగవంతుడిలో ఐక్యమైపోతాడు. ఇది విముక్తికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.

​అంగిలి తడి ఆరిపోతుంది..

మరణం అతి సమీపంలో జీవిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. బలవంతంగా నిర్భందంలో ఉన్న భావన కలుగుతుంది. నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం గుండా బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని త్యజిస్తుంది. ఫలితంగా కళ్లు, నోరు, చెవులలో శక్తి నశించి పోతుంది.

​నీడ రూపంలో బయటకు వెళ్తుంది..

ముక్కు కొన భాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనుషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్లిపోతుంది. మనిషి తన ప్రతి బింభాన్ని నీరు లేదా నెయ్యి, అద్దం, నూనేలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చే వారి నీడ.. మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.