యాప్నగరం

పూజలో హారతి ఎందుకు ఇస్తారో తెలుసా? ఇందుకు శాస్త్రీయ కారణం ఏంటి?

హారతి ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. ఇందుకు సమాధానం స్కందపురాణంలో కనిపిస్తుంది. స్కందపురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే పూజ విధానం తెలియనట్టే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు.

Samayam Telugu 22 Oct 2020, 6:27 am
హారతి.. ఏ పూజ చేసినా.. ఎలాంటి నోము నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తారు. అందువల్లే పూజలు ప్రారంభించే ముందే పళ్లెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఆరాధనలో హారతికి ఎందుకంత ప్రాముఖ్యతనిస్తారు? అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. ఇందుకు సమాధానం స్కందపురాణంలో కనిపిస్తుంది. స్కందపురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే పూజ విధానం తెలియనట్టే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. అందువల్ల మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది.
Samayam Telugu you know why aarti has to be done after pooja
పూజలో హారతి ఎందుకు ఇస్తారో తెలుసా? ఇందుకు శాస్త్రీయ కారణం ఏంటి?



​హారతికి శాస్త్రీయ కారణం..

హారతి ఇవ్వడమనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి కోసం పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. అదేవిధంగా నెయ్యి పాలలో ప్రాథమిక మిశ్రమం. కర్పూరం, చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు.

​అద్భుతమైన సువాసన..

పత్తితో పాటు నెయ్యి, కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలల వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.

​మనస్సు భగవంతుడిపై లగ్నమవుతుంది..

ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా మన శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. తద్వారా శరీరం శక్తిమంతవుతుంది. అంతేకాకండా భగవంతుడి అనుగ్రహం పొందుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.