యాప్నగరం

రిషబ్ పంత్ వచ్చాడు.. కానీ అతను బెంచ్‌కే..?

డికాక్‌ స్థానాన్ని యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌తో భర్తీ చేయాలని భావించిన దిల్లీ ఇప్పుడు ఆందోళనలో

TNN 8 Apr 2017, 11:10 pm
దిల్లీ డేర్‌డెవిల్స్ యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మళ్లీ జట్టుతో చేరాడు. ఇటీవల తన తండ్రి మరణించడంతో ఇంటికి వెళ్లిన రిషబ్.. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అంత్యక్రియల అనంతరం రిషబ్ పంత్ నిన్న రాత్రే మళ్లీ జట్టుతో చేరినట్లు దిల్లీ కోచ్ ప్యాడీ ఆప్టన్ వెల్లడించారు. ‘రిషబ్ పంత్ నిన్న సాయంత్రమే వచ్చాడు. డ్రెస్సింగ్ రూములో జట్టు సభ్యులంతా అతడిని ఓదారుస్తూ అండగా నిలుస్తున్నారు. చిన్న వయసులో అతనికి ఇలాంటి కష్టం రావడం బాధాకరం’ అని ప్యాడీ ఆప్టన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu bereaved rishabh pant returns to delhi daredevils fold
రిషబ్ పంత్ వచ్చాడు.. కానీ అతను బెంచ్‌కే..?


బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈ రోజు రాత్రి 8 గంటలకు దిల్లీ డేర్‌డేవిల్స్ తన తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతోంది. గత ఏడాది ఆరంభంలో మెరుగైన ప్రదర్శన చేసిన డేర్‌డెవిల్స్ .. చివర్లో తడబడి టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ ఏడాదైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉన్న దిల్లీకి టోర్నీ ఆరంభంలోనే వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ జట్టు ఓపెనర్/ వికెట్ కీపర్ డికాక్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీకి దూరమవగా.. ఆల్‌రౌండర్ డుమిని గాయం కారణంగా సీజన్‌లో ఆడలేనని ప్రకటించాడు. దీంతో వికెట్ కీపర్/ ఓపెనర్‌గా డికాక్‌ స్థానాన్ని యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌తో భర్తీ చేయాలని భావించిన దిల్లీ ఇప్పుడు ఆందోళనలో ఉంది. అంత్యక్రియల సమయంలో రిషబ్ పంత్‌ కాలికి గాయమవడంతో అతను బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలోకి దిగడని కోచ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.