యాప్నగరం

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు, ప్రత్యేక భవనాలు.. బడ్జెట్‌లో కేటాయింపులు

Harish Rao: ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేశారు.

Samayam Telugu 8 Mar 2020, 12:58 pm
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల పరిధుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధుల కోసం ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్ల నిధులు కేటాయించారు.
Samayam Telugu ts budget


అంతేకాక, ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేశారు.

Also Read: రైతులకు భారీ ఊరట.. రుణాలు ఒకే దఫాలో మాఫీ.. కానీ,

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,82,914.42 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని హరీశ్ అభిప్రాయపడ్డారు. అహింసా మార్గంలో రాష్ట్రం అవతరించిందని, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోందని హరీశ్ రావు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.