యాప్నగరం

బడ్జెట్ 2018: అరుణ్‌ జైట్లీ హల్వా తినిపించేశారు

కేంద్ర ఆర్థిక శాఖ అధికారులందరికీ అరుణ్ జైట్లీ హల్వా తినిపించారు. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు అధికారుల నోటిని తీపి చేయడం సంప్రదాయంగా వస్తోంది.

TNN 21 Jan 2018, 8:03 am
కేంద్ర ఆర్థిక శాఖ అధికారులందరికీ అరుణ్ జైట్లీ హల్వా తినిపించారు. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు అధికారుల నోటిని తీపి చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం సందర్భంగా ఎప్పటిలానే హల్వా వేడుకను నిర్వహించారు. పెద్ద పాత్రలో వండిన హల్వాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా అందరికి వడ్డించారు. అందరిచేత హల్వా తినిపించి బడ్జెట్ పత్రాల ముద్రణను ప్రారంభించారు. ప్రతి ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా వేడుకను జరపడం సంప్రదాయంగా వస్తోంది.
Samayam Telugu arun jaitley offers pre budget halwa to finance ministry officials
బడ్జెట్ 2018: అరుణ్‌ జైట్లీ హల్వా తినిపించేశారు


దాదాపు ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన దాదాపు 100 మంది అధికారులు ఈ హల్వా వేడుకలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సెక్రటరీ అశోక్‌ లవస, రెవెన్యూ సెక్రటరీ హస్‌ముఖ్‌ అథియా, చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారు. జైట్లీ ప్రవేశపెడుతున్న ఐదో బడ్జెట్ ఇది. అలాగే 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆఖరి బడ్జెట్ కూడా ఇదే కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.