యాప్నగరం

పేదలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5 లక్షల బీమా

బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సామాన్యుడి ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించారు.

TNN 1 Feb 2018, 12:07 pm
బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సామాన్యుడి ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా ఆరోగ్య పథకానికి రూపకల్పన చేశారు. కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల చొప్పున బీమాను ప్రకటించారు. ఈ పథకం వల్ల 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. తర్వాతి దశలో దీన్ని మరింత మందికి విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
Samayam Telugu budget 2018 arun jaitley announces national health protection scheme to cover poor families
పేదలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5 లక్షల బీమా


టీబీ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పిన మంత్రి.. వీరిలో పేదలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. టీబీ పేషెంట్ల కోసం రూ. 600 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పోషకాహరం తీసుకోవడం కోసం వీరిక ప్రతి నెలా రూ. 500 అందిస్తామన్నారు. 24 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేలా చూస్తామన్నారు.

చదవండి: Budget 2018 Live: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.