యాప్నగరం

ఏపీ రైల్వే జోన్: మళ్లీ హ్యాండిచ్చిన కేంద్రం!

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఏపీ రైల్వే జోన్ విషయాన్ని ప్రస్తావించకపోగా, స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేయడాన్ని ఏపీ ప్రజలు తప్పుబడుతున్నారు.

TNN 1 Feb 2018, 2:37 pm
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ హ్యాండిచ్చింది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 బడ్జెట్‌లో తప్పకుండా రైల్వే జోన్ విషయాన్ని ప్రకటిస్తారని అంతా ఆశించారు. అయితే, ఆ ప్రస్తావనే ఏదీ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కేంద్రం మళ్లీ తమను మోసం చేసిందంటూ నేతలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu budget 2018 arun jaitley made no mention on the creation of a separate railway zone for visakhapatnam
ఏపీ రైల్వే జోన్: మళ్లీ హ్యాండిచ్చిన కేంద్రం!


జైట్లీ తన ప్రసంగంలో రైల్వే జోన్‌పై ప్రసంగించకపోవడంపై తెలుగు దేశం పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు జైట్లీ కనీస సాయం ప్రకటించకపోవడం అన్యాయమని అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీకి ఇచ్చిన హామీ విస్మరించి బెంగళూరు మెట్రో, ముంబై సబర్బన్ రైల్వేకు రూ.17 వేల కోట్లు చొప్పున నిధులు కేటాయించడాన్ని విమర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఏపీ రైల్వే జోన్ విషయాన్ని ప్రస్తావించకపోగా, స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేయడాన్ని ఏపీ ప్రజలు తప్పుబడుతున్నారు. స్థానిక బీజేపీ నేతలపైనా మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.