యాప్నగరం

బడ్జెట్ 2018: గ్రామీణాభివృద్ధికి రూ.14.34 లక్షల కోట్లు

ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కేంద్ర బడ్జెట్‌‌లో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ జైట్లీ ప్రసంగం కొనసాగింది.

TNN 1 Feb 2018, 1:17 pm
2018 బడ్జెట్‌లో కేంద్రం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంటులో గురువారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గ్రామీణ ప్రాంతాలకు పెద్ద పీఠవేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పథకాల కోసం రూ.14.34 లక్షల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో రైతులకు కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు తెలియజేశారు. 2016-17 ఏడాదికి రికార్డుస్థాయిలో 275 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు జైట్లీ వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చి, రైతులకు మరింత ఆదాయం సమకూరేలా ఈ బడ్జెట్‌లో మరిన్ని ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి వ్యవస్థాగత రుణాలను రూ.11 లక్షల కోట్లు ప్రతిపాదించినట్లు జైట్లీ వ్యాఖ్యానించారు.
Samayam Telugu budget 2018government allocates rs 14 34 lakh crore for creating livelihood in rural areas
బడ్జెట్ 2018: గ్రామీణాభివృద్ధికి రూ.14.34 లక్షల కోట్లు


ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500 కోట్లు, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి కోసం రూ.2000 కోట్లు, ప్రధానమంత్రి సంచాయ్ యోజన కోసం రూ.2,600 కోట్లు, మత్స, కోళ్ల పరిశ్రమకు రూ.10 వేలు కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని ప్రకటించుకున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి సారించినట్టుగా పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని... రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించామని ప్రకటించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.