యాప్నగరం

పాన్, ఆధార్ లింక్ అని ఇన్నాళ్లూ చావగొట్టారు.. ఇప్పుడేమో ఇలా చేశారు

ఐటీ రిటర్నులు సమర్పించాలంటే.. ఆధార్, పాన్ అనుసంధానం తప్పనసరి అని ఇనాళ్లూ తెగ ఇబ్బందిపెట్టారు. ఇప్పుడేమో అసలు పాన్ కార్డు లేకున్నా ఫర్వాలేదని అంటున్నారు. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుంటే బాగుండేది కదా.

Samayam Telugu 5 Jul 2019, 3:33 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పదేళ్ల విజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల దిశగా వడివడిగా అడుగులేస్తుందన్న సీతారామన్.. ఆర్థిక పురోగతికి బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను పరిమితిని అలాగే ఉంచిన కేంద్ర సర్కారు.. ఐటీ రిటర్నులను సమర్పించడానికి పాన్ కార్డ్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ పాన్ కార్డ్ ఉంటేనే ఐటీ రిటర్నులను సమర్పించడానికి అవకాశం ఉంది.
Samayam Telugu adhar pan linking


పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తమ ఆధార్‌, పాన్‌ కార్టులను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు కూడా ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరని తీర్పునిచ్చింది. ఆధార్‌లా ఒకలా పేరుండి, పాన్‌కార్డులో మరోలా పేరున్న వారికి ఈ నిర్ణయం చుక్కలు చూపించింది.

కానీ కేంద్రం తాజా నిర్ణయంతో.. ఈ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. పాన్ కార్డు బదులు ఆధార్ కార్డును కూడా ఐటీ రిటర్నుల ధాఖలుకు ఉపయోగించుకోవచ్చు. పాన్ కార్డు లేని వారు సింపుల్‌గా ఆధార్ నంబర్ పేర్కొని ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చు.

మనదేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. దీంతో వీరిలో ఐటీ శ్లాబ్‌లోకి వచ్చేవారు.. పాన్‌తో పని లేకుండా తేలిగ్గా ఐటీ రిటర్నులు సమర్పించొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.