బ్యాంక్ ఖాతాదారులకు మోదీ అదిరిపోయే శుభవార్త.. ఆ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే తీపికబురు. కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ 2020లో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని పెంచాలని నిర్ణయించింది.
Samayam Telugu 1 Feb 2020, 1:17 pm
ప్రధానాంశాలు:
- బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు
- ఇన్సూరెన్స్ పరిమితి పెంపు
- దీంతో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ లాభం
మోదీ ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా బడ్జెట్ 2020లో బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని భారీగా పెంచుతామని ప్రతిపాదించారు. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లపై రూ.లక్ష వరకు మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇప్పుడు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతామని నిర్మతా సీతారామన్ ప్రకటించారు. ఇది నిజంగా బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలిగించే నిర్ణయమనే చెప్పాలి.
Also Read: undefined
బ్యాంక్ దివాలా తీసినప్పుడు బ్యాంక్లో డిపాజిట్ కలిగిన వారికి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే ఇకపై బ్యాంక్ కస్టమర్లకు ఇలాంటి సమయంలో ఏకంగా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీంతో బ్యాంక్లో అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ లాభం కలుగుతుంది.
Also Read: undefined
సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఇలా ఏ రకమైన అకౌంట్లకు అయినా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. బ్యాంక్ దివాలా తీసినప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కస్టమర్లకు అందిస్తుంది.
Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. ఎంతంటే?
బ్యాంకులు పూర్తిగా మూసివేసినప్పుడే ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఖాతాదారులకు లభిస్తుంది. లేదంటే లేదు. అన్ని బ్యాంకులు ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది. భారతలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుంది.
Also Read: undefined
బ్యాంక్ దివాలా తీసినప్పుడు బ్యాంక్లో డిపాజిట్ కలిగిన వారికి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే ఇకపై బ్యాంక్ కస్టమర్లకు ఇలాంటి సమయంలో ఏకంగా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీంతో బ్యాంక్లో అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ లాభం కలుగుతుంది.
Also Read: undefined
సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఇలా ఏ రకమైన అకౌంట్లకు అయినా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. బ్యాంక్ దివాలా తీసినప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కస్టమర్లకు అందిస్తుంది.
Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. ఎంతంటే?
బ్యాంకులు పూర్తిగా మూసివేసినప్పుడే ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఖాతాదారులకు లభిస్తుంది. లేదంటే లేదు. అన్ని బ్యాంకులు ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది. భారతలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుంది.