యాప్నగరం

Budget 2024: మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో ప్రవేశపెడతారు.. ఎందు కోసం?

Budget 2024: కేంద్ర ప్రభుత్వం 2024, ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ బడ్జెట్ ఎలాంటి సందర్భాల్లో ప్రవేశపెడతారు, పూర్తి స్థాయి బడ్జెట్ తో ఉన్న తేడాలేంటి? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 19 Jan 2024, 1:10 pm
Budget 2024: ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే, ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. దీనిని మధ్యంత బడ్జెట్ గా చెబుతారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వం 2024- 25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇంతకీ ఈ మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి? ఏయే సందర్భంలో ఇలా బడ్జెట్ ప్రవేశపెడతారు, దాని ప్రాముఖ్యత ఏమిటి? అనేది తెలుసుకుందాం.
Samayam Telugu budget-2024


మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి?
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ముందు ప్రభుత్వం సమర్పించే ఆర్థిక ప్రణాళికే మధ్యంతర బడ్జెట్. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు స్వల్ప కాలానికి ప్రభుత్వ వ్యయ అవసరాలు తీర్చేందుకు ఇది తాత్కాలికంగా ఏర్పాటుగా ఉంటుంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక ఏడాది ముగిసే వరకు కేంద్ర బడ్జెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మధ్య జరిగే ప్రభుత్వ ఖర్చులు, మధ్యంతర కాలంలో ఇతర వ్యయాలు భరించేందుకు ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంట్ అనుమతి అనేది తప్పనిసరి. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుంది.

మధ్యంతర బడ్జెట్‌లో సాధారణంగా వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పని తీరు, రాబోయే ఆర్థిక ఏడాదికి సంబంధించిన అంచనాలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రధాన విధానపరమైన ప్రకటనలు ఉండవు. ఎన్నికల సంఘం ప్రవర్తనా నియామవళి ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌లో ఓటర్లను ప్రభావితం చేసేలా ఏ పథకాన్ని చేర్చకూడదు. అలాగే ఈ బడ్జెట్ లో ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం కూడా లేదు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 116 ప్రకారం.. స్వల్పకాలిక వ్యయాలను కవర్ చేసేందుకు భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వానికి ముందస్తు మంజూరు చేసేదే ఓట్ ఆన్ అకౌంట్. ఈ ఫండ్ నుంచి ఏదైనా నగదు ఉపసంహరణ చేయాలంటే ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభమైనప్పుడు, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి అవసరం. అయితే, ఇందుకు సంబంధించిన బిల్లులు ఆమోదించేందుకు సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వ వ్యయానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పార్లమెంట్ తాత్కాలిక ఆమోదంగా చెబుతారు.


Read Latest Business News and Telugu News
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.