యాప్నగరం

గుడ్ న్యూస్.. ప్రైవేట్ ట్రైన్స్ వస్తున్నాయ్.. ఎప్పటి నుంచంటే?

రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందింది. కొత్త ట్రైన్స్ అవి కూడా ప్రైవేట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాదిలోనే బిడ్స్ ప్రక్రియ పూర్తి కానుంది.

Samayam Telugu 29 Jan 2021, 3:44 pm

ప్రధానాంశాలు:

  • రైల్వే ప్రయాణికులకు శుభవార్త
  • ఇక ప్రైవేట్ ట్రైన్స్
  • ఎప్పటి నుంచంటే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu indian railways
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఈ ఎకనమిక్ సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక సర్వే ప్రైవేట్ ట్రైన్స్ అంశాన్ని కూడా ప్రస్థావించింది. ప్రైవేట్ ట్రైన్స్ కోసం బిడ్స్ ఆహ్వానం 2021 మే చివరకు పూర్తవుతుందని తెలిపింది.
ప్రైవేట్ ట్రైన్స్ 2023-24 కల్లా అందుబాటులోకి రావొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఎయిర్ ట్రావెల్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలలోనే ప్రికోవిడ్ స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఆర్‌అండ్‌డీ కోసం అధిక కేటాయింపులు జరపాల్సి ఉందని సూచించింది.

Also Read: undefined


డిజిటల్ హెల్త్ మిషన్‌ పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే టెలీమెడిసిన్‌పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉందని సూచించింది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) జీడీపీ 11 శాతం మేర పెరిగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం మేర తగ్గొచ్చని, కానీ తర్వాత వీ షేప్ రికవరీ ఉంటుందని పేర్కొంది.

కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడలేదని, అన్ని రంగాలు చతికిలపడినా కూడా వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదైందని వివరించింది. పేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఆర్థిక వృద్ధిని కొనసాగించాలని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.