యాప్నగరం

పెరగనున్న ఆదాయపన్ను మినహాయింపు పరిమితి?

కేంద్ర బడ్జెట్‌ను మరి కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వేతన జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

TNN 18 Jan 2018, 12:39 pm
ఈ ఏడాది బడ్జెట్ కోసం సామాన్యుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆదాయపన్ను మినహాయింపు కోరుతున్న ఉద్యోగులకు ఊరట లభించేలా కేంద్రం నిర్ణయం ఉండనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల ముగింట పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుండదు. దీంతో ఈ బడ్జెట్‌లోనే వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 2.5 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారు ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. దీన్ని రూ. 3 లక్షలకు వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా ఆదాయ పన్ను శ్లాబులను మార్చాలని కూడా మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు.
Samayam Telugu finance minister arun jaitley is likely to raise income tax exemption limit from rs 2 5 lakh to rs 3 lakh
పెరగనున్న ఆదాయపన్ను మినహాయింపు పరిమితి?


ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వేతన జీవులకు ఊరట కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత బడ్జెట్లో ఆర్థిక శాఖ ఐటీ పరిమితిని పెంచనప్పటికీ.. రూ. 5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. నోట్ల రద్దు ప్రభావం, జీవన వ్యయం పెరగడంతోపాటు ఎన్డీయే సర్కారుకు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఆదాయ పన్ను పరిమితి పెరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచే వీలుందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల్లోపు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఇస్తుండగా.. దీన్ని రూ.2 లక్షలకు పెంచే వీలుందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.