Nirmala Sitaraman: యావత్ భారతదేశం ఇవాళ్టి కేంద్ర బడ్జెట్ (Union Budget 2023) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే మహిళగా రికార్డు లిఖించుకున్నారు. మరోవైపు.. వరుసగా నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఇప్పటికే కొత్త కొత్త సంప్రదాయాలకు తెరదీశారు. చాలా పద్ధతులు మార్చారు. ఇవాళ్టి బడ్జెట్ నేపథ్యంలో ఆ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
లెదర్ సూట్కేస్ బంద్..
కేంద్ర బడ్జెట్ ప్రతుల్ని బ్రిటిష్ కాలం నుంచి ప్రవేశపెడుతుండగా.. 2018 వరకు దీనిని లెదర్ సూట్కేసులో మాత్రమే తీసుకొచ్చేవారు. అయితే 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొలిసారే ఈ సంప్రదాయానికి చెక్ పెట్టారు. ఆమె ఈ బడ్జెట్ ప్రతుల్ని బాహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగ క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది. దీంతో భారతీయ సంస్కృతికి తెరతీశారు.
కరోనా సమయంలో డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది సరికొత్త సంప్రదాయంగా వచ్చింది. సరికొత్త యాప్ను కూడా లాంఛ్ చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దారు.
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అదే ఏడాది నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆమె. తొలుత మహిళగా ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఉండగా.. నిర్మలా సీతారామన్ రెండో మహిళ. అయితే ఇందిరా గాంధీ తాత్కాలిక ఆర్థిక మంత్రి మాత్రమే. ఇక ఈసారి బడ్జెట్తో వరుసగా ఐదుసార్లు, మొత్తంగా ఐదుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.
దేశంలో బంగారానికి తగ్గిన డిమాండ్.. ఎందుకు కొనట్లేదో అసలు కారణం తెలిస్తే..
ఎక్కువసేపు ప్రసంగం..
ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగానే కాదు.. ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. తొలిసారి 2019-20 బడ్జెట్లో 137 నిమిషాల సేపు ప్రసంగించగా అప్పటివరకు అదే రికార్డు. సుదీర్ఘ ప్రసంగం అదే. 2003-04లో జస్వంత్ సింగ్ 135 నిమిషాల సేపు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక 2020-21లో 162 నిమిషాల సేపు ప్రసంగించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.
ఇంకా కరోనా సమయంలో మినీ బడ్జెట్ను వేర్వేరు రూపాల్లో నాలుగైదు ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలా సీతారామన్కే దక్కుతుంది. ఇంకా ఈ సారి బడ్జెట్లో మరిన్ని కొత్త రికార్డులు ఏమన్నా సృష్టిస్తారో ఎదురుచూడాలి. ఈ సారి బడ్జెట్కు మోదీ సర్కార్ 2.O కు చివరిదైన నేపథ్యంలో.. దీనిపై చాలా అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి వర్గం పెద్ద ఆశలే పెట్టుకుంది.
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న నిర్మలా సీతారామన్
మాంద్యం భయాల నడుమ ఆశల పద్దు.. నేడే పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్.. భరోసా ఇచ్చేనా?
లెదర్ సూట్కేస్ బంద్..
కేంద్ర బడ్జెట్ ప్రతుల్ని బ్రిటిష్ కాలం నుంచి ప్రవేశపెడుతుండగా.. 2018 వరకు దీనిని లెదర్ సూట్కేసులో మాత్రమే తీసుకొచ్చేవారు. అయితే 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొలిసారే ఈ సంప్రదాయానికి చెక్ పెట్టారు. ఆమె ఈ బడ్జెట్ ప్రతుల్ని బాహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగ క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది. దీంతో భారతీయ సంస్కృతికి తెరతీశారు.
కరోనా సమయంలో డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది సరికొత్త సంప్రదాయంగా వచ్చింది. సరికొత్త యాప్ను కూడా లాంఛ్ చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దారు.
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అదే ఏడాది నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆమె. తొలుత మహిళగా ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఉండగా.. నిర్మలా సీతారామన్ రెండో మహిళ. అయితే ఇందిరా గాంధీ తాత్కాలిక ఆర్థిక మంత్రి మాత్రమే. ఇక ఈసారి బడ్జెట్తో వరుసగా ఐదుసార్లు, మొత్తంగా ఐదుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.
దేశంలో బంగారానికి తగ్గిన డిమాండ్.. ఎందుకు కొనట్లేదో అసలు కారణం తెలిస్తే..
ఎక్కువసేపు ప్రసంగం..
ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగానే కాదు.. ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. తొలిసారి 2019-20 బడ్జెట్లో 137 నిమిషాల సేపు ప్రసంగించగా అప్పటివరకు అదే రికార్డు. సుదీర్ఘ ప్రసంగం అదే. 2003-04లో జస్వంత్ సింగ్ 135 నిమిషాల సేపు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక 2020-21లో 162 నిమిషాల సేపు ప్రసంగించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.
ఇంకా కరోనా సమయంలో మినీ బడ్జెట్ను వేర్వేరు రూపాల్లో నాలుగైదు ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలా సీతారామన్కే దక్కుతుంది. ఇంకా ఈ సారి బడ్జెట్లో మరిన్ని కొత్త రికార్డులు ఏమన్నా సృష్టిస్తారో ఎదురుచూడాలి. ఈ సారి బడ్జెట్కు మోదీ సర్కార్ 2.O కు చివరిదైన నేపథ్యంలో.. దీనిపై చాలా అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి వర్గం పెద్ద ఆశలే పెట్టుకుంది.
- Read Latest Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న నిర్మలా సీతారామన్
మాంద్యం భయాల నడుమ ఆశల పద్దు.. నేడే పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్.. భరోసా ఇచ్చేనా?