యాప్నగరం

Budget 2023: వేతనజీవులకు భారీ ఊరట.. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు

Budget 2023: బడ్జెట్ 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్ కీలక ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని (income rebate limit) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వేతనజీవులకు పెద్ద ఊరట దక్కనుంది. పన్ను శ్లాబ్స్‌ను కూడా గతంలో 6 ఉండగా.. ఇప్పుడు 5గా మార్చారు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 1 Feb 2023, 5:27 pm
Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో (Budget Updates News) నిర్మలా సీతారామన్ వేతనజీవులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు (income rebate limit) పరిమితి అంతా ఊహించినట్లుగానే పెంచేశారు. రూ. 5 లక్షలుగా ఉండగా.. అది ఇప్పుడు రూ.7 లక్షలకు చేర్చారు. అంటే వీరు మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. దీంతో రూ. 7లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం రిబేట్ కారణంగా రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించట్లేదు. ఇప్పుడు ఈ పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. తాజాగా రిబేట్ కారణంగా.. రూ. 7 లక్షల వరకు పన్నులు ఉండవు.
Samayam Telugu income tax rebate


పన్ను చెల్లింపుదారులకు అంతా ఊహించినట్లుగానే.. కీలక ప్రకటన చేశారు. వారికి వరాల జల్లు కురిపించారు నిర్మలమ్మ. మొత్తం ఈ సందర్భంగా 5 కీలక ప్రకటనలు చేశారు. గతంలో ఉన్న పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు చేర్పులు చేశారు. మొత్తం 6 శ్లాబ్స్ ఉండగా ఇప్పుడు దానిని 5కు చేర్చారు. దీని ప్రకారం.. రూ.3 లక్షల లోపు ఎలాంటి పన్నులు ఉండవు. రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ. 6 నుంచి 9 లక్షల వార్షికాదాయం ఉంటే 10 శాతం, రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షికాదాయం ఉంటే 15 శాతం, రూ. 12 నుంచి రూ.15 లక్షల వార్షికాదాయం ఉన్న వారు 20 శాతం పన్ను, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే.. 30 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.


ఇక కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గానే ఉంటుందని, పౌరులు పాత పన్ను విధానాన్ని కూడా ఎంచుకునేందుకు ఆప్షన్ ఉంటుందని ప్రకటించారు. ఇక అత్యధిక ట్యాక్స్ రేటు 42.7 శాతం ఉందని నిర్మలమ్మ అన్నారు. కొత్త పన్ను విధానంలో సర్ ఛార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో అత్యధిక ట్యాక్స్ రేటు 39 శాతానికి చేరుకుంటుంది.

పన్ను ఇలా కట్టాలి

    • రూ.9లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఇప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ఇప్పుడు వీరు రూ.60 వేలు చెల్లిస్తున్నారు.
    • ఇదే రూ.15 లక్షల వేతనం ఉన్న వారు గతంలో రూ. 1.87 లక్షలు చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.1.5 లక్షలకు తగ్గనుంది.
  • undefinedundefined
  • రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. వడ్డీ రహిత రుణాలపై బడ్జెట్‌లో కీలక ప్రకటన

    Also Read: రైల్వేలకు రికార్డ్ స్థాయిలో రూ.2.04 లక్షల కోట్లు
    రచయిత గురించి
    పూర్ణచందర్ తూనం
    తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

    తరవాత కథనం

    Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.