కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించారు. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించిన ఆయన... నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనే లేదు. విశాఖకు రైల్వే జోన్ అంశాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. జైట్లీ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించ లేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఏమాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు జైట్లీ చేసిన కేటాయింపులు వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు...
* విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
* ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* ఎన్ఐటీకి రూ.54కోట్లు.
* ఐఐటీకి రూ.50కోట్లు.
* ట్రిపుల్ ఐటీకి రూ.30కోట్లు.
* ఐఐఎంకు రూ.42కోట్లు,
* ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు,
* డ్రెడ్జింగ్ కార్పోరేషన్కు రూ.19.62కోట్లు.
తెలంగాణకు కేటాయింపులు ...
* హైదరాబాద్ ఐఐటీకి రూ.75కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు...
* విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
* ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* ఎన్ఐటీకి రూ.54కోట్లు.
* ఐఐటీకి రూ.50కోట్లు.
* ట్రిపుల్ ఐటీకి రూ.30కోట్లు.
* ఐఐఎంకు రూ.42కోట్లు,
* ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు,
* డ్రెడ్జింగ్ కార్పోరేషన్కు రూ.19.62కోట్లు.
తెలంగాణకు కేటాయింపులు ...
* హైదరాబాద్ ఐఐటీకి రూ.75కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.