యాప్నగరం

బడ్జెట్ వాయిదాపై సర్వత్రా ఉత్కంఠ

లోక్ సభ సభ్యుడు కేరళకు చెందిన ఇ అహ్మాద్ ఆకస్మిక మరణంతో బుధవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై

TNN 1 Feb 2017, 9:12 am
లోక్ సభ సభ్యుడు కేరళకు చెందిన ఇ అహ్మాద్ ఆకస్మిక మరణంతో బుధవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనవాయితీ ప్రకారం సిట్టింగ్ సభ్యుడు లేదా సభ్యురాలు మరణిస్తే వారి మృతికి సభ సంతాపం ప్రకటించి సభను వాయిదా వేస్తారు.
Samayam Telugu ls speaker to decide on budget postponement
బడ్జెట్ వాయిదాపై సర్వత్రా ఉత్కంఠ


బీఏసీ నిర్ణయం ప్రకారం బుధవారం 11గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఈ నేపథ్యంలో గుండెపోటుతో సిట్టింగ్ ఎంపీ మరణించడంతో బుధవారం బడ్జెట్ ప్రవేశపెడతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ఉదయం 11గంటలకు పార్లమెంటు సమావేశం కాగానే..అహ్మాద్ మృతికి సంతాపం ప్రకటించి..సభను రేపటికి వాయిదా వేయడం..లేదా లోక్ సభను వాయిదా వేసి...బడ్జెట్ ను రాజ్యసభలో ప్రవేశపెట్టడం అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే సభ కొనసాగింపు, వాయిదాలపై స్పీకర్ దే తుదినిర్ణయం.

మరోవైపు ఎంపీ మరణిస్తే అది లోక్ సభ, రాజ్యసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అనేది కాకుండా...పార్లమెంటేరియన్ గా చూడాల్సి వస్తుందని అలాంటప్పుడు బుధవారం సభ సంతాపం ప్రకటించి...మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు.

మరోవైపు ఉదయం 8 గంటలకే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఇతర సహాయ మంత్రులు బేటీ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నారు. పరిస్థితులను బట్టి ఆర్థికశాఖ వ్యవహారించనుంది.

తాము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రెడీ ఉన్నామని...సహచర ఎంపీ ఆకస్మిక మరణంతో సభను వాయిదా వేసే నిర్ణయం స్పీకర్ పై ఆధారపడి ఉందని...స్పీకర్ నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటామని మంత్రి సంతోష్ సంగ్వర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.